ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై కలెక్టర్ సమీక్ష
వార్డు, సర్కిల్ వారీగా లక్ష్యాలు.. రోజువారీ పురోగతిపై ప్రత్యేక దృష్టి
హనుమకొండ | Ntoday News
హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో ఆస్తి, నీటి పన్నుల వసూళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో పన్నుల వసూళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.
సర్కిల్, వార్డు వారీగా పన్నుల వసూళ్లకు నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించి, వాటి సాధనపై రోజువారీగా పురోగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టి లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు.
అదేవిధంగా కొత్త అసెస్మెంట్లు, డబుల్ అసెస్మెంట్లు, టాప్ డిఫాల్టర్లు, కమర్షియల్ భవనాలు, పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బకాయిల వసూళ్లను వేగవంతం చేసి, మున్సిపల్ ఆదాయాన్ని పెంచేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
పన్నుల వసూళ్లలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి వెంటనే పరిష్కారం చూపాలని, ప్రతి వార్డు స్థాయిలో వసూళ్ల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.