ప్రగతి హై స్కూల్ లో గోరింటాకు వేడుకలు
ప్రగతి హై స్కూల్ లో గోరింటాకు వేడుకలు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం మండలంలోని ఉరుమడ్లలో ఉన్న ప్రగతి ఉన్నత పాఠశాలలో గోరింటాకు సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.మన సంప్రదాయాలు వాటి వెనుక ఉన్న వైజ్ఞానిక విశేషాలను విద్యార్థులకు తెలియజేసేoదుకు ఈ కార్యక్రమాన్నీ నిర్వహించామని పాఠశాల కరస్పాండెంట్ గుత్తా మహేందర్ రెడ్డి అన్నారు.విద్యార్థినులు ,ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని విద్యార్థులకు సహజ సిద్ధమైన గోరింటాకును అలంకరిస్తూ ఆషాఢ మాసపు పాటలతో సందడి చేశారు.ఆషాఢ మాసం లో గోరింటాకును గౌరిదేవి అనుగ్రహం, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు.వర్షా కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లను, శరీరంలో వేడినీ తగ్గించడానికి గోరింటాకు సహజ సిద్ధమైన ఔషధంగా పనిచేస్తుందని తెలిపారు.దీని వెనుక ఉన్న శాస్త్రీయతను గుర్తించి ప్రస్తుత కాలంలో రసాయన కోoడ్ల కు దూరంగా ఉండాలన్నారు .
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉయ్యాల చంద్రశేఖర్, ఉపాధ్యాయులు పట్ల జనార్దన్, ఎండి రఫిక్, యాదగిరి, హంసశ్రీ, నిర్మల, నాగమణి, దనమ్మ,శైలజ, రమ్య, దివ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.