BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

ప్రజా సమస్యలపై ఎస్పీ బిందు మాధవ్ సత్వర చర్యల ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
12 May, 2026 - 09:34 AM
59 వీక్షణలు

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 49 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలు

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మొత్తం 49 ఫిర్యాదులను స్వీకరించారు.

స్వీకరించిన ఫిర్యాదుల్లో భూ తగాదాలకు సంబంధించినవి 11, కుటుంబ కలహాలకు సంబంధించినవి 19 కాగా, ఇతర విభాగాలకు చెందినవి 19గా గుర్తించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ గారు సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే 7 రోజుల లోపు విచారణ పూర్తి చేసి, తగిన పరిష్కారం చూపుతూ పూర్తి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జి. బిందు మాధవ్, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో కాకినాడ జిల్లా పోలీసులు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నారని తెలిపారు.

– జిల్లా పోలీస్ కార్యాలయం, కాకినాడ