ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ
ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సికిల్ సెల్ మరియు ఇతర వంశపారంపర్య వ్యాధుల పరీక్షలపై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ శ్రీధర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో పాటు సికిల్ సెల్ మరియు తలసేమియా సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ కాసర్ల శ్రీనివాస్, చుంచు శంకర వర్మ, అవినాష్, కంకణాల భాస్కర్ రెడ్డి తదితరులు చురుగ్గా పాల్గొన్నారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, శ్రీ నామదేవ్, కాకినాడ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పుట్ట సత్తయ్య, ఇతర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. వ్యాధి తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) పరిధిలోనూ ఆయా వైద్యాధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రజలకు సికిల్ సెల్ వ్యాధిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు