చిలకలూరిపేటలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
చిలకలూరిపేట: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఈ నెల 20వ తేదీన చిలకలూరిపేట మండలంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ మరియు ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది.
పర్యటనకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించగా, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది.
‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం ద్వారా రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించనుండగా, ‘స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర’ కార్యక్రమం ద్వారా పరిశుభ్రత, అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.