www.ntodaynews.com
RTC డిపో ఆవరణంలో ఘనంగా శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠ
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరు RTC డిపో ఆవరణంలో శ్రీ మహాగణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం వేద పండితులు గణపతి విగ్రహాన్ని శాస్రోత్తకంగా ప్రతిష్టించారు. తర్వాత స్వామి వారిని సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి ఫల పుష్పాలను నివేదించి సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ దినేష్, డిపో సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డిపో మేనేజర్ దినేష్ మాట్లాడుతూ సిబ్బందితో పాటు మీ అందరి సహాయ సహకారాలతో శ్రీ మహాగణపతి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఆయన తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆది దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.