BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట!

అంతర్జాతీయం అంతర్జాతీయం
18 Jun, 2026 - 11:15 AM
179 వీక్షణలు

దేశంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్‌లలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా "VPN for Telegram" లేదా "Telegram VPN" వంటి పదాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు ట్రెండ్ డేటా సూచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం NEET-UG 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్షలకు సంబంధించిన మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల ప్రచారం, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 
ఆంక్షలు అమల్లోకి వచ్చిన వెంటనే టెలిగ్రామ్‌కు సంబంధించిన ప్రత్యామ్నాయ యాక్సెస్ మార్గాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పలువురు వినియోగదారులు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికలపై కూడా ఈ అంశం విస్తృత చర్చకు దారితీసింది.

ఇక టెలిగ్రామ్ ఆంక్షలపై సంస్థ కూడా స్పందించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. టెలిగ్రామ్ తరఫున ఈ ఆంక్షలు లక్షలాది మంది సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.