BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

Telegram Ban: టెలిగ్రామ్ బ్యాన్‌తో ట్రెండింగ్‌లోకి కొత్త యాప్.. జనాలు ఎక్కువగా సెర్చ్ చేస్తోంది దీని కోసమేనట!

అంతర్జాతీయం అంతర్జాతీయం
18 Jun, 2026 - 11:15 AM
137 వీక్షణలు

దేశంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత గూగుల్ సెర్చ్‌లలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా "VPN for Telegram" లేదా "Telegram VPN" వంటి పదాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు ట్రెండ్ డేటా సూచిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం NEET-UG 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్షలకు సంబంధించిన మోసాలు, నకిలీ ప్రశ్నాపత్రాల ప్రచారం, పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 
ఆంక్షలు అమల్లోకి వచ్చిన వెంటనే టెలిగ్రామ్‌కు సంబంధించిన ప్రత్యామ్నాయ యాక్సెస్ మార్గాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పలువురు వినియోగదారులు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికలపై కూడా ఈ అంశం విస్తృత చర్చకు దారితీసింది.

ఇక టెలిగ్రామ్ ఆంక్షలపై సంస్థ కూడా స్పందించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. టెలిగ్రామ్ తరఫున ఈ ఆంక్షలు లక్షలాది మంది సాధారణ వినియోగదారులపై ప్రభావం చూపుతున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.