అటవీ ప్రాంతంలో భారీగా నక్సల్స్ ఆయుధాల పట్టివేత
అటవీ ప్రాంతంలో భారీగా నక్సల్స్ ఆయుధాల పట్టివేత
ఎస్ఎల్ఆర్ రైఫిల్, తుపాకులు, గ్రెనేడ్లు స్వాధీనం
ఛత్తీస్గఢ్: భద్రతా బలగాలు నక్సల్స్కు గట్టి ఎదురుదెబ్బ కొట్టాయి. సోమవారం నిర్వహించిన తనిఖీల్లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
భేజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భండార్పదర్, మునుర్కొండ అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా నక్సల్స్ దాచిన ఆయుధాలను గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న వాటిలో ఎస్ఎల్ఆర్ రైఫిల్, 315 బోర్ తుపాకీ, మస్కెట్ రైఫిల్, బీజీఎల్ లాంచర్, గ్రెనేడ్లు, ఇతర పేలుడు సామగ్రి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆయుధాల స్వాధీనం నేపథ్యంలో అటవీ ప్రాంతంలో మరింత విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. నక్సల్స్ కదలికలపై నిఘా పెంచిన భద్రతా బలగాలు అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నాయి.