www.ntodaynews.com
తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు..
జాతీయం
తమిళనాడు: మహిళా ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవులు.. సీఎం విజయ్ కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. మూడో బిడ్డకు ప్రస్తుతం అమలులో ఉన్న 12 వారాల ప్రసూతి సెలవులను ఏడాది రోజులకు పెంచుతూ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మొదటి, రెండో సంతానంతో పాటు మూడో బిడ్డకు కూడా 365 రోజుల పాటు పూర్తి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందనున్నారు.
రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.4కు పడిపోయిన నేపథ్యంలో కుటుంబాల పెంపకాన్ని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళా ఉద్యోగుల సంక్షేమం, శిశు సంరక్షణకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.