ఆరుగురు పేకాటరాయిలు అరెస్ట్
ఆరుగురు పేకాటరాయిలు అరెస్ట్
నార్కట్పల్లి గోపలాయిపల్లి గ్రామ శివారులో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న స్థావరంపై నార్కట్పల్లి పోలీసులు సోమవారం దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.4,620 నగదు, ఆరు సెల్ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కట్పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి తన సిబ్బందితో కలిసి గోపలాయపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఎడవల్లి గ్రామానికి చెందిన ఎడమ సత్తయ్య, వనిపాకల గ్రామానికి చెందిన మామిడి లింగస్వామి, నేరడ గ్రామానికి చెందిన పాలకూరి లక్ష్మణ్, చిట్యాల గ్రామానికి చెందిన బొలుగూరి నాగరాజు, శంకరయ్య, వనిపాకల గ్రామానికి చెందిన మేడి ఎల్లేష్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.