www.ntodaynews.com
మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య...
అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా,పుంగనూరు మేలుపట్లలో నివాసం ఉంటున్న శ్రావణి(19) తన కుటుంబ కలహాల కారణం గా ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని సోమవారం చోటుచేసుకొంది.
పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మేలుపట్లకు చెందిన శ్రావణి(19) , గతంలో పెళ్లి జరిగి భర్త వదిలివేయడంతో ఆమె మరో యువకుడు గణేష్ ను వివాహం చేసుకుని జీవిస్తోంది.ఇలా ఉండగా భార్యభర్తలు గొడవ పడటంతో మనస్థాపానికి గురైన శ్రావణి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.