BREAKING
టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు
www.ntodaynews.com

జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 10:48 PM
7 వీక్షణలు

జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన విస్సన్నపేటలో అధికారుల సూచనలు.. పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశాలు

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో జననాలు, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ హాజరయ్యారు.

డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లకు నూతన చట్టంలోని నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించారు. జనన, మరణాల నమోదు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని, నమోదు ప్రక్రియలో పారదర్శకతతో పాటు ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.

కొత్త చట్టం అమలులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు.