జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన
జనన, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై సిబ్బందికి అవగాహన విస్సన్నపేటలో అధికారుల సూచనలు.. పారదర్శకంగా సేవలు అందించాలని ఆదేశాలు
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కార్యాలయంలో జననాలు, మరణాల నమోదు సవరణ చట్టం-2026పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్, తహసీల్దార్, ఎంపీడీఓ హాజరయ్యారు.
డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లకు నూతన చట్టంలోని నిబంధనలపై అధికారులు అవగాహన కల్పించారు. జనన, మరణాల నమోదు ప్రక్రియలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని, నమోదు ప్రక్రియలో పారదర్శకతతో పాటు ఖచ్చితత్వం పాటించాలని ఆదేశించారు. దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.
కొత్త చట్టం అమలులో భాగంగా డిజిటల్ అసిస్టెంట్లు, మీ సేవా ఆపరేటర్లు బాధ్యతగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆర్డీవో ఎ. కుమార్ తెలిపారు.