BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 24 August 2026, 10:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నీటి సరఫరా పునరుద్ధరించండి.. ఇబ్బందులు తొలగించండి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 10:47 PM
49 వీక్షణలు

నీటి సరఫరా పునరుద్ధరించండి.. ఇబ్బందులు తొలగించండి మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌కు 7వ వార్డు కలవగట్టు మహిళల వినతి

ఉయ్యూరు, ఆగస్టు 24:

ఉయ్యూరు పట్టణంలోని 7వ వార్డు కలవగట్టు ప్రాంతంలో నీటి సమస్యపై ముస్లిం మహిళలు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల పట్టణంలో అతిసార వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా పైపుల ద్వారా సరఫరా చేసే నీటిని నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు.

అయితే తమ ప్రాంతానికి ట్యాంకర్ దూరంగా ఉండటంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహిళలు తెలిపారు. గత మూడు, నాలుగు రోజులుగా గృహ అవసరాలకు కూడా సరిపడా నీరు అందడం లేదని పేర్కొంటూ గతంలో మాదిరిగానే పైపుల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.

ఈ సందర్భంగా వైవీబీ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరులోని కొన్ని ప్రాంతాల్లో వాంతులు, విరోచనాలు వంటి అనారోగ్య సమస్యలు నమోదయ్యాయని తెలిపారు. నీరు కలుషితం కావడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయనే అనుమానంతో అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి పరీక్షల కోసం నమూనాలను ప్రయోగశాలలకు పంపించారని చెప్పారు.

ప్రజలు తప్పనిసరిగా నీటిని కాచి వడపోసి తాగాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రస్తుతం పైపుల ద్వారా వచ్చే నీటిని గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు నీటి సరఫరా చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాస్, అంజిబాబు, జంపన శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి, 7వ వార్డు మాజీ కౌన్సిలర్ వడుపు కార్తీక్, మాజీ కౌన్సిలర్లు బూరెల నరేష్, పల్యాల శ్రీను, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు.