కారుమూరి రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కీలక ఆరోపణలు..
కారుమూరి రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కీలక ఆరోపణలు.. రూ.18.09 కోట్ల లావాదేవీలపై ఆధారాలు ఉన్నాయన్న అధికారులు
మద్యం రవాణా కుంభకోణం కేసులో కారుమూరి కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో రూ.18.09 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు ఈడీ తెలిపింది.
రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాల్లో 50 శాతం కమీషన్గా ఇవ్వాలని కారుమూరి కోరినట్లు ఈడీ ఆరోపించింది. మొత్తం రూ.11.95 కోట్లను కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించింది.
దర్యాప్తు సమయంలో కారుమూరి సహకరించలేదని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరు కావాలని పది సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని తెలిపింది. బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్ష్యాల తారుమారును అడ్డుకునేందుకు కస్టడీ అవసరమని ఈడీ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది.