BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

స్నాప్‌చాట్ పరిచయం.. ఆర్థిక మోసానికి దారి

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:44 PM
19 వీక్షణలు

స్నాప్‌చాట్ పరిచయం.. ఆర్థిక మోసానికి దారి చనిపోతానంటూ బెదిరించి యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు చేసిన యువకుడు

విజయవాడ/హైదరాబాద్‌: సోషల్‌ మీడియా పరిచయం ఓ యువతిని భారీ ఆర్థిక మోసానికి గురిచేసింది. స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయమైన యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నుంచి ఏకంగా రూ.1.38 కోట్లు వసూలు చేసిన ఘటనపై సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ సూర్యారావుపేటకు చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు మద్దిశెట్టి గౌతంనాయుడు అనే యువకుడు స్నాప్‌చాట్‌ ద్వారా పరిచయమయ్యాడు. తాను విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట తన స్వస్థలమని చెప్పి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.

కొంతకాలంగా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ కలిసి కోయంబత్తూరు పర్యటనకు వెళ్లారు. అక్కడ గౌతంనాయుడు తాను ఆన్‌లైన్‌ క్రిప్టోకరెన్సీలో రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టానని, ప్రస్తుతం ఆ డబ్బు బ్లాక్‌ అయిందని చెప్పాడు. అత్యవసరంగా డబ్బులు కావాలని యువతిని కోరాడు.

అతడి మాటలు నమ్మిన యువతి లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని తొలుత రూ.10.42 లక్షలు ఇచ్చింది. మరింత డబ్బు కావాలని అడగడంతో తన వద్ద లేవని చెప్పింది. దీంతో గౌతంనాయుడు తనకు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించడం ప్రారంభించాడు.

ఇందులో భాగంగా సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుంటున్నట్లు ఫొటోను వాట్సప్‌లో పంపడంతో యువతి తీవ్ర భయాందోళనకు గురైంది. విషయం తల్లికి తెలియకుండా ఇంట్లోని బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తనఖా పెట్టడంతో పాటు క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు తీసుకుని మరో రూ.1.27 కోట్లు అతడికి ఇచ్చింది.

అయినా గౌతంనాయుడు ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేయడంతో బాధిత యువతి చివరకు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

– బూర్గుల రమేష్, రిపోర్టర్