BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

బంగ్లాదేశ్‌ రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య?

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:48 PM
15 వీక్షణలు

బంగ్లాదేశ్‌ రంగ్‌పూర్‌లో హిందూ కుటుంబం దారుణ హత్య? నలుగురు మృతి.. అనుమానాస్పద స్థితిలో మృతదేహాలు

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. తాళం వేసి ఉన్న ఇంట్లో రిటైర్డ్ పాఠశాల ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత, కుమార్తె అగామి, కుమారుడు ప్రియమ్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నలుగురిని గొంతు నులిమి హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. గణపతి చక్రవర్తి మృతదేహం ఇంటి పైకప్పుపై, భార్య ప్రీతిలత, కుమార్తె అగామి మృతదేహాలు మెట్ల వద్ద, కుమారుడు ప్రియమ్ మృతదేహం మంచం కింద లభ్యమయ్యాయి. 

రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకపోవడంతో బంధువులు ఆందోళనకు గురై ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 

ఈ ఘటనపై పోలీసులు, నేర పరిశోధన విభాగం దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.