www.ntodaynews.com
ప్రపంచ రెజ్లింగ్లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం
అంతర్జాతీయం
ప్రపంచ రెజ్లింగ్లో భారత మహిళల సత్తా.. మాన్సికి రజత పతకం
అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళా రెజ్లర్లు సత్తా చాటారు. మొత్తం మూడు పతకాలతో భారత్ మెరిసింది.
68 కిలోల విభాగం ఫైనల్లో చైనాకు చెందిన చెంగ్లింగ్ సాంగ్తో తలపడిన మాన్సి లాథర్ పోరాడి ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది.
మరోవైపు కాంస్య పతక పోరులో భారత రెజ్లర్లు తన్వి మగ్దుమ్ (57 కిలోలు), కోమల్ (59 కిలోలు) అద్భుత ప్రదర్శన కనబరిచి ప్రత్యర్థులను ఓడించారు. దీంతో ఇద్దరూ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.
యువ మహిళా రెజ్లర్ల విజయాలతో అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్ ఖ్యాతి మరింత పెరిగింది.