www.ntodaynews.com
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి–ట్రీసా జోడీకి కాంస్య పతకం
అంతర్జాతీయం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో గాయత్రి–ట్రీసా జోడీకి కాంస్య పతకం
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత మహిళల డబుల్స్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ కాంస్య పతకం సాధించింది.
సెమీఫైనల్ పోరులో చైనా టాప్ సీడ్ జోడీ ట్యాన్ నింగ్–లియూ షెంగ్డూతో తలపడిన గాయత్రి–ట్రీసా జోడీ 21–18, 13–21, 8–21 తేడాతో ఓటమి పాలైంది. తొలి గేమ్లో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన భారత జోడీ.. తర్వాతి రెండు గేమ్లలో ప్రత్యర్థి దూకుడును అడ్డుకోలేకపోయింది.
సెమీఫైనల్కు చేరుకోవడం ద్వారా గాయత్రి–ట్రీసా జోడీ ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. భారత బ్యాడ్మింటన్కు మరో ప్రతిష్టాత్మక విజయాన్ని అందించింది.