లోయ అంచున ఆగిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
లోయ అంచున ఆగిన బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం తప్పింది. జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయ అంచు వరకు వెళ్లి ఆగిపోయింది.
సోమవారం ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు వేగంగా దూసుకెళ్లి బ్రిడ్జి సేఫ్టీ వాల్ను ఢీకొట్టి లోయ అంచున నిలిచిపోయింది.
బస్సు లోయలో పడకుండా సేఫ్టీ వాల్ అడ్డుగా నిలవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురైనప్పటికీ, అందరూ సురక్షితంగా బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
"సేఫ్టీ వాల్ లేకపోయి ఉంటే బస్సు లోయలోకి పడిపోయేది" అంటూ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.