www.ntodaynews.com
పుంగనూరుకు రైతు బజార్ మంజూరు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా పుంగనూరులో రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం రూ.28 లక్షలు మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా మార్కెట్ కమిటీ అధికారి త్యాగరాజు తెలిపారు. బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ శమీపతి యాదవ్, కార్యదర్శి గోపితో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా పుంగనూరుకు ఈ ప్రాజెక్టు మంజూరైందన్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రైతులు మరియు వినియోగదారులకు రైతు బజార్ ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.