BREAKING
ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ
www.ntodaynews.com

బలకవారిపల్లిలో కోదండరాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా.

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
18 Jun, 2026 - 10:23 AM
206 వీక్షణలు

బలకవారిపల్లి, అమ్మడుగూరు:

ఎన్ టుడే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు

శ్రీ సత్యసాయి జిల్లా అమ్మడుగూరు మండలంలోని చీకిరేవులపల్లి పంచాయతీ పరిధిలోని బలకవారిపల్లి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు బుధవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదం పంపిణీ చేయగా, మూడు రోజుల పాటు నిరంతర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకు విరాళాలు అందించిన దాతలను గ్రామస్తులు పూలమాలలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతల కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు.

వేద పండితులు సీదిరెడ్డిపల్లి నాగేంద్రశర్మ కుమారుల ఆధ్వర్యంలో, పలువురు వేద పండితుల సమక్షంలో మూలవిరాట్ విగ్రహాల ప్రతిష్ఠ, అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

గ్రామస్తులు అందరూ ఏకతాటిపై నడుస్తూ తక్కువ సమయంలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని భక్తులు కొనియాడారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బలకవారిపల్లి గ్రామస్తులు, భక్తులు, దాతలు, వేద పండితులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవాలయ సేవలో తమ వంతు సహకారం అందించారు.