విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం
విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం
ఎన్ టుడే న్యూస్
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం విద్యార్థులకు సురక్షిత త్రాగునీటి కోసం 25 వేల రూపాయలు అందించిన విద్యా మణిబాబు దంపతులు
దేవరపల్లి మండలం యర్నగూడెం జడ్పీ హై స్కూల్ నందు మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తుల కారణంగా కొంతకాలంగా పనిచేయక పోవడంతో విద్యార్థులు త్రాగునీటి అవసరాలకోసం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ బొంతా సోమరాజు సమస్యను పలువురు దాతల దృష్టికి తీసుకు వచ్చారు
దొమ్మేరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దాత కేబీఆర్ గ్రూప్స్ చైర్మన్ కొమ్మన మణిబాబు సత్యకుమారి దంపతులు స్పందించి విద్యార్థులకోసం విద్యా సుగంధాలు పరిమళించేందుకు తమ దాతృత్వాన్ని చూపిస్తూ మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు 25వేల రూపాయలను అందించారు
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వూబా చంద్రరావు ఎస్ఎంసీ చైర్మన్ బొంతా సోమరాజు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అధికారులు పంపన ధనలక్ష్మి రాజ్ కుమార్ బుజ్జిబాబు పతంజలి ఉపాధ్యాయులు తదితరులు విద్యా మణిబాబు దంపతులకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు