చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చింతలపూడి పోలీస్ స్టేషన్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
చింతలపూడి: చింతలపూడి పోలీస్ స్టేషన్ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఐ క్రాంతికుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు చేసిన ప్రాణ త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. దేశ అభివృద్ధి, ప్రజల రక్షణలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
పోలీసులు సమాజానికి రక్షణ కవచంలా పనిచేస్తున్నారని, ప్రజల భద్రత కోసం విధుల పట్ల అంకితభావంతో, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.