BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం పుట్టుక నీది చావునీది మధ్య బతుకంతా దేశానిది.... వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన
www.ntodaynews.com

వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
15 Aug, 2026 - 08:49 AM
83 వీక్షణలు

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం దిగువ బాగాన ఘర్షణ...

వెంకట్రావుపేటలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లక్షెట్టిపేట మండలం, వెంకట్రావుపేట:

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం సమర్పించారు.


ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వెంకట్రావుపేట ZPHS పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నారు.


ఈ సందర్భంగా సర్పంచ్ నలిమేల రాజు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


విద్యార్థులు దేశ భవిష్యత్తుకు పునాదులని, వారిలో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. గ్రామ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


కార్యక్రమం అనంతరం విద్యార్థులకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి మరియు పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. దేశభక్తి నినాదాలతో వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ ఆవరణ సందడిగా మారింది.