నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన
ఎల్బీనగర్ ఆగస్ట్ 14/ ఎన్ టుడే న్యూస్.
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఈరోజు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో తో కలిసి నాగోల్ డివిజన్ పరిధిలోని మధురానగర్ నందు పర్యటించడం జరిగింది .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పక్క కాలనీలు అయిన ఇంద్రపస్తకాలని, ధనలక్ష్మి నగర్ కాలనీ తదితర చుట్టుపక్కల కాలనీలో నుంచి వచ్చే వరదనీరు మరియు డ్రైనేజీ నీరు ఇట్టి మధుర నగర్ దగ్గర ఆగిపోవడం జరుగుతుంది.దీనివల్ల చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు కాలనీ నందు చేరడం జరుగుతుంది.గతంలో మధురానగర్ కాలనీ అపార్ట్మెంట్ దగ్గర వరదనీరు పోవడానికి చిన్న ఔట్ లేట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఇప్పుడు అది సరిపోవడం లేదని తెలిపారు.దానిలో భాగంగా అట్టి అవుట్ లేట్ స్థానంలో పెద్ద అవుట్ లేట్ నిర్మిస్తే రాబోయే రోజుల్లో వరద నీరు సాఫీగా పోతుంది అని సుధీర్ రెడ్డి తెలిపారు. దానికి స్పందించిన జోనల్ కమిషనర్ తప్పకుండా పెద్ద అవుట్ లెట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.దానికి కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ బారసా నాయకులు అనంతుల రాజిరెడ్డి,డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.