ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం
శ్రీ సత్య సాయి జిల్లా తాడిమర్రి మండల కేంద్రంలో రహదారి విస్తరణలో ఇల్లు, వ్యాపార సముదాయాలు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లను ఆశ్రయించారు. ఈ మేరకు బాధితులు తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. బాధితుల కథనం ప్రకారం... 2023 ఆగస్టు 11న తాడిమర్రి గ్రామంలో రహదారి విస్తరణ కార్యక్రమం చేపట్టారు. గతంలో సుమారు 20 అడుగుల మేర ఉన్న రహదారిని ఒక్కసారిగా 60 అడుగులకు విస్తరించే చర్యలు చేపట్టడంతో రహదారికి ఇరువైపులా ఉన్న అనేక ఇల్లు, వ్యాపార దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, నేలమట్టం అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, తగిన సమయం, అవకాశం కల్పించకుండా, నష్టపరిహారం నష్టపరిహారం చెల్లించకుండానే నిర్మాణాలని తొలగించారని బాధితులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూచి రాము, శివరామయ్య, హర్షవర్ధన్, వినోద్ కుమార్, మహేష్, పక్కిర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సత్య సాయి జిల్లా