ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్కు అవార్డు
ఉత్తమ ఆర్డీఓగా ఎ. కుమార్కు అవార్డు
తిరువూరు: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎ. కుమార్ ఉత్తమ ఆర్డీఓ అవార్డును అందుకున్నారు. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
రెవెన్యూ పరిపాలనలో సమర్థవంతమైన విధులు నిర్వహించడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడం, అధికారుల పనితీరును పర్యవేక్షించడం వంటి అంశాల్లో చురుకైన పాత్ర పోషించినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
అవార్డు అందుకున్న సందర్భంగా ఆర్డీఓ ఎ. కుమార్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.