ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆమడగూరు, ఆగస్టు 15 (ఎన్ టుడే న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు):
పుట్టపర్తి నియోజకవర్గంలోని ఆమడగూరు మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ మారుతీ ప్రకాష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శకుంతలమ్మ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అపర్ణ, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈవో జిలాన్ బాషా, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గోపాలకృష్ణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహం, ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి, మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ శిరీష జాతీయ జెండాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. పాఠశాలల్లో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, స్థానికులను అలరించాయి.
అలాగే పలువురు ఆటో డ్రైవర్లు తమ ఆటోలను జాతీయ జెండాలతో ప్రత్యేకంగా అలంకరించి దేశభక్తిని చాటుకున్నారు.
వేడుకల్లో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.