తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెం: గ్రామంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రజక వృత్తిదారుల వివరాల సేకరణకు సంబంధించిన సర్వే ఫారంను రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆవనగంటి స్వామి, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు బోనగిరి శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజక వృత్తిదారుల కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వృత్తి సంబంధిత వివరాలను సమగ్రంగా సేకరించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే ద్వారా వృత్తిదారుల వాస్తవ పరిస్థితులను గుర్తించి, వారి సమస్యలు మరియు అవసరాలను సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రజక వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ప్రతి రజక వృత్తిదారుల కుటుంబం సర్వేలో భాగస్వామ్యం కావాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో, సంఘం నాయకులు, గ్రామ రజక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.