పోలవరం పీఏసీఎస్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
పోలవరం పీఏసీఎస్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షులు యర్రా ప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు (చిట్టిబాబు), గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ యర్రా రమేష్, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
దేశ స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ నాయకులు ప్రసంగించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో గ్రామస్తులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.