BREAKING
తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం తుమ్మలగూడెంలో రజక వృత్తిదారుల సంఘం సర్వే ఫారం ఆవిష్కరణ ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆమడగూరు ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు సీపీఎం కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: సీపీఎం 79 కి.మీ. నాన్‌స్టాప్ స్కేటింగ్‌తో ప్రపంచ రికార్డు సాధించిన చిన్నారి అనంత దక్షిత్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన వెల్లంకి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థుల త్రాగునీటి కొరకు విరాళం
www.ntodaynews.com

ఎల్కతుర్తి :మండలంలో ది విశాల సహకార సంఘం సభ్యులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
పెద్దబోయిన శ్రీకాంత్ ఎల్కతుర్తి మండల ప్రతినిధి
15 Aug, 2026 - 03:19 PM
16 వీక్షణలు
సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ది విశాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్

ఎల్కతుర్తి: మండలంలోని ది విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు శ్రీపతి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు, సభ్యులు, నాయకులు, మండల ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీపతి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం కేవలం కులం, మతం, జాతికి సంబంధించినది కాదని, ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ అని అన్నారు. దేశ స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. సహకార సంఘం అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో నష్టాల్లో ఉన్న సంఘాన్ని ప్రస్తుతం లాభాల బాటలోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సంఘాన్ని మరింత అభివృద్ధి చేసి సభ్యులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మండల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గుర్తించి, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కార్యక్రమంలో సహకార సంఘం కమిటీ ఉపాధ్యక్షులు, సభ్యులు, నాయకులు, మండల ఎంపీడీవో తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.