బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా మెగా జాబ్ మేళా ఏర్పాటు
పుంగనూరు అన్నమయ్య జిల్లా భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని ఆర్ సి వై ప్రాంగణంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నువ్వేగా నియోజకవర్గo నుంచే కాక జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నట్టు ఉద్యోగం లేని ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసమే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎంతో మంది నిరుద్యోగులు వారి వారి చదువుదృష్ట వివిధ కంపెనీలు ఏర్పాటుచేసిన ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 120 కి పైగా కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే ఈ జాబ్ మేళా ను ఏర్పాటుచేసిన బోడె రామచంద్ర యాదవ్ గారికి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు