BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

అనధికారిక పోలీస్ సైరన్‌తో ప్రయాణం.. అమలాపురంలో కారు స్వాధీనం, జరిమానా

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
18 Jun, 2026 - 04:39 PM
29 వీక్షణలు

అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ అనధికారికంగా ప్రోటోకాల్ సైరన్ ఉపయోగించిన ఓ కారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. AP 40 HT 0055 నంబర్ గల కారు పోలీస్ సైరన్ శబ్దంతో పట్టణంలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఈ విషయాన్ని అమలాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ Veerababu వెల్లడించారు. సదరు వాహనంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన పోలీస్ సైరన్‌ను తొలగించి, వాహన యజమానిపై జరిమానా విధించినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా కలిగిన అధికారులు, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే సైరన్ వినియోగానికి అనుమతి ఉంటుందని, సాధారణ వాహనాల్లో అనధికారికంగా సైరన్లు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని పోలీసులు స్పష్టం చేశారు.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సీఐ వీరబాబు సూచించారు.