www.ntodaynews.com
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త
తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుని రైతు భరోసా నిధులకు ఆమోదం తెలిపింది.
ఈ నెల 30వ తేదీన రైతుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయనున్నారు.
మధిరలో భారీ స్థాయి బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. అదే వేదిక నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుండటంతో గ్రామ గ్రామానా ఉత్సాహం, ఆసక్తి నెలకొంది.
రైతుల కళ్లల్లో ఆశలు మళ్లీ వెలిగిస్తున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది