BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 02 September 2026, 11:09 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ప్రసన్నయ్యగారిపల్లిలో గడపగడపకు టీడీపీకు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Sep, 2026 - 11:09 PM
5 వీక్షణలు

పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇంటింటా ప్రజలను కలవాలని పిలుపు

పుంగనూరు | Ntoday News

అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామంలో ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ప్రసన్నయ్యగారిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, గ్రామస్తులు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ వై. మధుసూదన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల సమస్యలను తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.

అనంతరం ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమానికి సంబంధించిన లోగోను వై. మధుసూదన్ నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, పార్టీ విధానాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో మోపురి మోహన్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో, ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.