www.ntodaynews.com
ప్రతికూల వాతావరణంతో అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
జాతీయం
ప్రతికూల వాతావరణంతో అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
జమ్మూకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేటి నుంచి అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల భద్రత దృష్ట్యా బాల్తాల్, పహల్గాం మార్గాల నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు సుమారు 3.7 లక్షల మంది భక్తులు అమర్నాథ్ మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు.