BREAKING
ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు ఇడుపులపాయలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం.. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం విప్పర్ల, మర్రిచెట్టుపాలెం మార్గంలో ప్రమాదం జరిగింది నర్సరావుపేట జేఎన్ టీయూకే కాలేజీలో నూతన హాస్టల్ భవనాలు ప్రారంభం మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.. విద్యార్థిపై దాడి చేసిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలి వైఎస్సార్ 17వ వర్ధంతి ఘనంగా నిర్వహణ అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
Date of Publish : 03 September 2026, 05:13 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో ఘనంగా వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 05:13 AM
22 వీక్షణలు

ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, పర్వతాపురం: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ ఆధ్వర్యంలో పర్వతాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.

రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు పక్కా ఇళ్ల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో మహానేతగా నిలిచిపోయారని అన్నారు. వైయస్‌ఆర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఘన నివాళులర్పించారు.