పర్వతాపురంలో ఘనంగా వైయస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి
ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, పర్వతాపురం: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ ఆధ్వర్యంలో పర్వతాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిద్దె శివాజీ మాట్లాడుతూ.. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైయస్ రాజశేఖర్రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పేదలకు పక్కా ఇళ్ల వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల గుండెల్లో మహానేతగా నిలిచిపోయారని అన్నారు. వైయస్ఆర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొని వైయస్ రాజశేఖర్రెడ్డికి ఘన నివాళులర్పించారు.