BREAKING
thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి
Date of Publish : 16 September 2026, 03:13 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మారు వేషంలో.. సామాన్యుడిలా పోలవరం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Sep, 2026 - 03:13 PM
8 వీక్షణలు

మారు వేషంలో.. సామాన్యుడిలా  తహసీల్దార్ కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

ఏలూరు జిల్లా, బుట్టాయగూడెం: సామాన్యుడిలా మారు వేషంలో వెళ్లి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న సేవలను స్వయంగా పరిశీలించారు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. టీషర్ట్, గళ్ల లుంగీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఎవరూ గుర్తుపట్టలేని విధంగా బుట్టాయగూడెం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు.

ఉదయం 11.30 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే సుమారు గంటపాటు అక్కడే ఉండి వివిధ పనుల కోసం వచ్చిన ప్రజల పరిస్థితిని గమనించారు. సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, కార్యాలయంలో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొందరు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

స్థల వివాదానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని బుట్టాయగూడెంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మాధవరావు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. తన సమస్య పరిష్కారం కావడం లేదని, పలుమార్లు కార్యాలయానికి వచ్చినా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తారని, వారిని అనవసరంగా తిప్పుకోవడం సరికాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ప్రజలకు చిత్తశుద్ధితో, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని ఆదేశించారు.

మారు వేషంలో ఎమ్మెల్యే కార్యాలయాన్ని తనిఖీ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలకు ప్రభుత్వ సేవలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్నది స్వయంగా తెలుసుకునేందుకే ఈ ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలుస్తోంది.