రామసముద్రం–పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం..
రామసముద్రం - పుంగనూరు రహదారిలో రోడ్డు ప్రమాదం - వ్యక్తికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం, రామసముద్రం నుండి పుంగనూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రసన్నయ్యగారిపల్లి మూలమలుపు వద్ద గల పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో పెద్ద పంజాని మండలం పెద్దారికుంట గ్రామానికి చెందిన కే.వెంకటరమణ అదుపుతప్పి కింద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనదారుడికి కాలు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అక్కడే ఉన్న స్థానికులు, వాహనదారులు స్పందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది .
ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.