BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 03 September 2026, 08:05 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

రాయికల్‌లో కాంగ్రెస్ విఫల పాలనపై బిఆర్ఎస్ నిరసన ర్యాలీ

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
03 Sep, 2026 - 08:05 PM
11 వీక్షణలు

రాయికల్‌లో కాంగ్రెస్ విఫల పాలనపై బిఆర్ఎస్ నిరసన ర్యాలీ, రైతు సదస్సు  

​రాయికల్:

కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనను నిరసిస్తూ రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీ రైతు ర్యాలీ, రైతు సదస్సు నిర్వహించారు.

​స్థానిక గాంధీ చౌక్ నుండి బస్టాండ్ వరకు సాగిన ఈ నిరసన ర్యాలీలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

​ఈ కార్యక్రమంలో BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

​ర్యాలీ అనంతరం నిర్వహించిన రైతు సదస్సులో నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సాగునీరు, రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.