రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్కు అవకాశం
రీ సర్వే భూముల సమస్యలపై అప్పీల్కు అవకాశం
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి: చింతలపూడి తహసిల్దార్ సిహెచ్ దొర
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం: రీ సర్వే జరిగిన గ్రామాల్లో భూములకు సంబంధించి కొలతలు, విస్తీర్ణంలో తేడాలు ఉన్న ప్రజలు చింతలపూడి తహసిల్దార్ కార్యాలయంలో అప్పీల్ దరఖాస్తులు చేసుకోవాలని మండల తహసిల్దార్ సిహెచ్ దొర సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన రీ సర్వే ప్రాజెక్టులో భాగంగా రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ వివరాలపై నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసులు అందిన 21 రోజుల్లోగా అభ్యంతరాలు, సమస్యలకు సంబంధించి అప్పీల్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మంగళవారం సీతానగరం గ్రామంలో రీ సర్వేకు సంబంధించి 9(2) నోటీసుల పంపిణీ కోసం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి రీ సర్వే డీటీ షేక్ షకీలా, స్థానిక వీఆర్వో పాల్గొన్నారు.