BREAKING
రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు
www.ntodaynews.com

మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Aug, 2026 - 07:38 PM
12 వీక్షణలు

మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా.

పుంగనూరు.

పుంగనూరు: మదనపల్లి నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

పుంగనూరు మండలానికి చెందిన విజయ్ కుమార్ (25) తన ద్విచక్ర వాహనంపై ఒక మహిళతో కలిసి మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తుండగా, భీమగానిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడగా, మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. విజయ్ కుమార్ ఎడమ కాలుకు గాయం కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

అనంతరం క్షతగాత్రులను పుంగనూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.