మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం
మదనపల్లి నుంచి పుంగనూరుకు వెళ్తున్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదం
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
పుంగనూరు: మదనపల్లి నుంచి పుంగనూరుకు ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
పుంగనూరు మండలానికి చెందిన విజయ్ కుమార్ (25) తన ద్విచక్ర వాహనంపై ఒక మహిళతో కలిసి మదనపల్లి నుంచి పుంగనూరు వైపు వస్తుండగా, భీమగానిపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరూ కిందపడగా, మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. విజయ్ కుమార్ ఎడమ కాలుకు గాయం కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు.
అనంతరం క్షతగాత్రులను పుంగనూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.