సమ్మర్ క్యాంప్ ని విద్యార్థులు వినియోగించుకోవాలి : ఎంఈఓ సైదా నాయక్
NTODAY NEWS చిట్యాల
వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎంఈఓ సైదా నాయక్, చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 రోజులపాటు వివిధ విభాగాలలో విద్యార్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చిట్యాల ఎంఈఓ సైదా నాయక్ తెలిపారు. మే 11 సోమవారం వేసవి శిబిరాన్ని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత తో కలిసి ఆయన వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం మే 25 వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పుస్తకాల లో ఉన్న పాఠాలతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఈ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు యోగా, వ్యాయామం ,క్రీడలు , కంప్యూటర్ శిక్షణ, మెడిటేషన్ వాటిని నేర్పిస్తారని పేర్కొన్నారు. ఇటువంటి విద్యలు నేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడి స్వీయ క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోడ సుశీల, ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, కోణం శ్రీనివాస్, జి.ఇందిర, ఎన్.సైదులు, జి.శైలజ, జె.మంజుల, సిహెచ్.శంకర్, ఎన్.సరళ, డి.కుసుమ, కంప్యూటర్ శిక్షకులు బి.నవీన్,యోగా శిక్షకులు శేఖర్ పాల్గొన్నారు.