సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు
సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు
న్యూఢిల్లీ, మార్చి 27:
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సరుకుల నిల్వలు, సరఫరా వ్యవస్థలను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
అదే విధంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తీర ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం పెంచుకుని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.