BREAKING
చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం చాట్రాయిలో గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి మూడు నెలల రేషన్ పంపిణీ.. క్యూలైన్‌లో గంటల తరబడి తిప్పలు... కరెంటు కోత.. ఉక్కపోత.. హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ... నంద్యాలజిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS గారు టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్లకు సంబంధించి క్రైమ్ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ. జైపూర్ కేజీబీవీలో ప్రమాదం మంగళగిరి ఎయిమ్స్‌లో నాణ్యమైన వైద్యం – తక్కువ ఖర్చుతో సేవలు అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేసిన ప్రమోద్ గుప్త, పూణే వాసి ఏప్రిల్ 21న శంకరజయంతి అన్న క్యాంటీన్లకు ఏటా రూ.50లక్షల విరాళం
www.ntodaynews.com

సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:06 PM
41 వీక్షణలు

సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 27:

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సరుకుల నిల్వలు, సరఫరా వ్యవస్థలను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

అదే విధంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తీర ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం పెంచుకుని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.