BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Mar, 2026 - 11:06 PM
139 వీక్షణలు

సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: ప్రధాని మోదీ ఆదేశాలు

న్యూఢిల్లీ, మార్చి 27:

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కీలక సూచనలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన ఆయన, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సంక్షోభ పరిస్థితులను ఆసరాగా చేసుకుని బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సరుకుల నిల్వలు, సరఫరా వ్యవస్థలను పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

అదే విధంగా దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. తీర ప్రాంతాలు, అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సమన్వయం పెంచుకుని అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని మోదీ పునరుద్ఘాటించారు.