BREAKING
జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు
www.ntodaynews.com

ఆపరేషన్‌ సిందూర్‌ అమరుల వివరాల వెల్లడి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
70 వీక్షణలు

న్యూఢిల్లీ, జూన్‌ 27: పాకిస్థాన్‌ దాడులకు ప్రతిస్పందనగా భారత్‌ గత ఏడాది చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా వెల్లడించింది. వీరిలో ఐదుగురు భారత సైన్యానికి, ఒకరు భారత వైమానిక దళానికి చెందినవారు. అమర వీరుల పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్‌సైట్‌లోని గౌరవ పట్టికలో ప్రచురించడంతో పాటు, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం 3డీ గోడపై కూడా పొందుపరిచారు.

అమరులైన వారిలో సుబేదార్‌ మేజర్‌ పవన్‌ కుమార్‌, రైఫిల్‌మ్యాన్‌ సునీల్‌ కుమార్‌, లాన్స్‌ నాయక్‌ దినేశ్‌ కుమార్‌, హవల్దార్‌ సునీల్‌ కుమార్‌ సింగ్‌, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్‌ మురళీనాయక్‌, భారత వైమానిక దళానికి చెందిన సార్జంట్‌ సురేంద్ర కుమార్‌ ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ జవాన్లకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది.