ఆపరేషన్ సిందూర్ అమరుల వివరాల వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 27: పాకిస్థాన్ దాడులకు ప్రతిస్పందనగా భారత్ గత ఏడాది చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో అమరులైన ఆరుగురు సైనికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తొలిసారిగా వెల్లడించింది. వీరిలో ఐదుగురు భారత సైన్యానికి, ఒకరు భారత వైమానిక దళానికి చెందినవారు. అమర వీరుల పేర్లను జాతీయ యుద్ధ స్మారక వెబ్సైట్లోని గౌరవ పట్టికలో ప్రచురించడంతో పాటు, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం 3డీ గోడపై కూడా పొందుపరిచారు.
అమరులైన వారిలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్, వైమానిక సాంకేతిక నిపుణుడు మూడ్ మురళీనాయక్, భారత వైమానిక దళానికి చెందిన సార్జంట్ సురేంద్ర కుమార్ ఉన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన ఈ జవాన్లకు కేంద్ర ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది.