BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

డ్రైవింగ్ లైసెన్స్ ఇక మరింత కఠినం.. మూడు దశల పరీక్షలు తప్పనిసరి!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
69 వీక్షణలు

రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ పొందిన తర్వాత నేరుగా డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లే అవకాశం ఉండదు.

కొత్త విధానం ప్రకారం, లెర్నర్స్ లైసెన్స్ అనంతరం అభ్యర్థులు మరో రెండు ఆన్‌లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారికే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో ప్రాక్టికల్ పరీక్షకు అనుమతి లభిస్తుంది.

అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై 2 నుంచి 3 గంటల పాటు ప్రత్యేక వీడియోలను తప్పనిసరిగా వీక్షించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

రోడ్డు ప్రమాదాలను తగ్గించి, బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.