డ్రైవింగ్ లైసెన్స్ ఇక మరింత కఠినం.. మూడు దశల పరీక్షలు తప్పనిసరి!
రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలక మార్పులు తీసుకురానున్నారు. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ పొందిన తర్వాత నేరుగా డ్రైవింగ్ టెస్ట్కు వెళ్లే అవకాశం ఉండదు.
కొత్త విధానం ప్రకారం, లెర్నర్స్ లైసెన్స్ అనంతరం అభ్యర్థులు మరో రెండు ఆన్లైన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో పాస్ అయిన వారికే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో ప్రాక్టికల్ పరీక్షకు అనుమతి లభిస్తుంది.
అలాగే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై 2 నుంచి 3 గంటల పాటు ప్రత్యేక వీడియోలను తప్పనిసరిగా వీక్షించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి, బాధ్యతాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.