www.ntodaynews.com
టీడీపీ సీనియర్ నాయకుడు గంట సాయి కృష్ణ కుటుంబానికి పరామర్శ
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో అకాల మరణం చెందిన టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు గంట సాయి కృష్ణ కుటుంబాన్ని ఏలూరు జిల్లా టీడీపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జగ్గవరపు ముత్తారెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా గంట సాయి కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మఠంగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు తూంపాటి కిషోర్, టీడీపీ సీనియర్ నాయకులు అన్నప్పనేని వెంకన్న బాబు, ఇసుక శ్రీను, చినబాబు, సోంబాబు, జాస్తి శ్రీను, రాయంకుల సిటీ తదితర నాయకులు పాల్గొన్నారు.