www.ntodaynews.com
తెలంగాణలో ఆటోలు, క్యాబ్లు బంద్.. అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల సమ్మె
తెలంగాణ
తెలంగాణలో ఆటోలు, క్యాబ్లు బంద్.. అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల సమ్మె
తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు డ్రైవర్ల సంఘాలు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, డ్రైవర్ల రక్షణ కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని డ్రైవర్ల సంఘాలు స్పష్టం చేశాయి.