BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లు బంద్.. అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల సమ్మె

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:27 PM
24 వీక్షణలు

తెలంగాణలో ఆటోలు, క్యాబ్‌లు బంద్.. అర్ధరాత్రి నుంచి డ్రైవర్ల సమ్మె

తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు సమ్మెకు దిగారు. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు డ్రైవర్ల సంఘాలు ప్రకటించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని, డ్రైవర్ల రక్షణ కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశాయి. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని డ్రైవర్ల సంఘాలు స్పష్టం చేశాయి.