తెలంగాణలో సామాన్యుడిపై మీసేవ భారం
తెలంగాణలో సామాన్యుడిపై 'మీసేవ' భారం: భారీగా పెరిగిన సర్వీస్ ఛార్జీలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా పొందే వివిధ రకాల సర్వీసుల ఛార్జీలను ప్రభుత్వం భారీగా పెంచింది. పెంచిన ఈ నూతన ధరలు ఏప్రిల్ 1, 2026 (నేటి) నుండి అమలులోకి వస్తాయని ఐటీ అండ్ సి (ITE & C) విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కనిష్ట ఛార్జీ 35 రూపాయలు ఉండగా, ఇప్పుడది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
పెరిగిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
కేటగిరీ - ఏ (Category-A): ఈ విభాగంలోని సర్వీసులకు గతంలో ఉన్న ఛార్జీలను సవరించి ప్రస్తుతం 62 రూపాయలుగా నిర్ణయించారు. (ఉదా: సర్టిఫికెట్ల రీ-ఇష్యూ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (EC), బర్త్ సర్టిఫికెట్ ప్రింట్ మొదలైనవి).
కేటగిరీ - బి (Category-B): ఈ విభాగంలోని సర్వీసుల ఛార్జీలను 80 రూపాయలకు పెంచారు. (ఉదా: ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు, విద్యుత్ కనెక్షన్, ఓబిసి సర్టిఫికెట్ మొదలైనవి).
బిల్లు చెల్లింపులు: కరెంటు బిల్లులు, ఇతర పన్నుల చెల్లింపుల ఛార్జీలలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.
స్కానింగ్/ప్రింటింగ్: దరఖాస్తు సమయంలో మొదటి 4 పేజీల తర్వాత, ప్రతి అదనపు పేజీ స్కాన్ లేదా ప్రింటింగ్కు రూ. 2.50 అదనంగా వసూలు చేస్తారు.
ఫిర్యాదులు: నిర్ణయించిన ధరల కంటే ఎవరైనా అదనంగా వసూలు చేస్తే 1100 / 1800 425 1110 నంబర్లకు లేదా meesevasupport@telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చు.
అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడం పట్ల సామాన్య ప్రజల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అవసరమైన పత్రాల కోసం ఇకపై సామాన్యులు అదనపు భారాన్ని భరించక తప్పని పరిస్థితి నెలకొంది.