BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:35 AM
32 వీక్షణలు

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరి

హైదరాబాద్‌: తెలంగాణలో విద్యుత్ వినియోగ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్లకు ఇకపై స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం దశలవారీగా ప్రస్తుతం ఉన్న పాత విద్యుత్ కనెక్షన్లకు కూడా స్మార్ట్ మీటర్లను అమర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల 30 లేదా 31వ తేదీ అర్ధరాత్రి ఆటోమేటిక్‌గా విద్యుత్ వినియోగ రీడింగ్ నమోదు అవుతుంది. ఆ వివరాల ఆధారంగా వినియోగదారులకు బిల్లులు పంపించే విధానం అమల్లోకి రానుంది. దీంతో మాన్యువల్ రీడింగ్ ప్రక్రియకు ముగింపు పలకనున్నారు.

అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు మాత్రం తప్పనిసరిగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముందుగా నగదు చెల్లించి విద్యుత్ వినియోగించే విధానం ప్రభుత్వ విభాగాల్లో అమలు చేయనున్నారు.

స్మార్ట్ మీటర్ల అమలుతో విద్యుత్ వినియోగంలో పారదర్శకత పెరగడంతో పాటు, బిల్లింగ్ లోపాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.